హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ వద్ద నాగ్పూర్-విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులను భూనిర్వాసితులు అడ్డుకున్నారు. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ.4 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కోర్టు స్టే ఉన్నా అధికారులు పనులు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 405 కి.మీల ఈ ప్రాజెక్టును రూ.14,000 కోట్లతో మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మీదుగా నిర్మిస్తున్నారు.