హనుమకొండ జిల్లా కడిపికొండ రాజీవ్ గృహకల్పలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి, కుమార్తె అనుమానాస్పదస్థితిలో సజీవదహనమయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడు ప్రవీణ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది. ఘటన అనంతరం నిందితుడు పిల్లలతో పారిపోయేందుకు ప్రయత్నించగా.. మడికొండ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.