సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనుల కారణంగా కొన్ని రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి మళ్లించారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మే, జూన్ నెలల్లో హైదరాబాద్ నుండి రామేశ్వరం, మధురై మార్గాల్లో 16 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలను రైల్వే అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. లేదా ఇతర రైల్వే సమాచార కేంద్రాల ద్వారా తెలుసుకోవచ్చు. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పూర్తయ్యే వరకు ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.