హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

1 year ago 49
హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్ వద్ద ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. డీసీఎం అతివేగం, అజాగ్రత్తలే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
Read Entire Article