తెలంగాణ అసెంబ్లీలో రాఘవ కన్ స్ట్రక్షన్స్, బాలానగర్ భూముల వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయి ఘర్షణ చోటుచేసుకుంది. మాజీ మంత్రి హరీశ్ రావు సోదరుడు, మామ ధరణిని అడ్డం పెట్టుకుని వందల ఎకరాలు అక్రమంగా బదలాయించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమాలపై హౌస్ కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధమని సవాల్ విసిరారు. మరోవైపు రాఘవ కన్ స్ట్రక్షన్స్ అక్రమాలపై సీబీ సీఐడీ విచారణకు ఆదేశిస్తూ.. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలన్న బీఆర్ఎస్ డిమాండ్ను తోసిపుచ్చారు.