ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు ఐసీయూ వెంటిలేటర్లు మాయమయ్యాయి. కరోనా సమయంలో రూ.22 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ వెంటిలేటర్లు కనబడకుండా పోవడంతో ఆసుపత్రి సిబ్బందిలో కలకలం రేగింది. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఆసుపత్రిలోని వ్యక్తుల పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. దీనితో పాటు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కూడా మాయమయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. పూర్తి వివరాలు..