విశాఖపట్నం జిల్లా సింహాచలంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే ( ఎంజేపీ ) గురుకుల పాఠశాల హాస్టల్లో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. గురుకుల పాఠశాలను సందర్శించారు. హాస్టల్ గదులు, కిచెన్, స్టోర్ రూమ్, వాష్ రూమ్లను పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గంటా శ్రీనివాసరావు.. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.