ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందువులు కుటుంబ నియంత్రణ పాటించవద్దని, ఎక్కువ మంది పిల్లలను కనడం దేశానికి అవసరమని అన్నారు. అలాగే, 2029లో ఏర్పడే హిందువుల ప్రభుత్వంలో తాను తెలంగాణ హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆయనకు 'ఆల్ ది బెస్ట్' చెప్పడం గమనార్హం.