హిజ్రాలు ఎవరైనా బలవంతంగా డబ్బులు అడిగి ఇబ్బందులకు గురిచేస్తే, వేధిస్తే.. వెంటనే పోలీసులను సంప్రదించాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేస్తే పోలీసులు తక్షణమే స్పందించేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గృహప్రవేశం సందర్భంగా కొందరు హిజ్రాలు డబ్బు కోసం ఒత్తిడి చేశారని.. దుండిగల్ పోలీసులు సకాలంలో జోక్యం చేసుకుని తమను రక్షించారని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్కు డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు.