హిమాయత్‌ నగర్‌లో దారుణం.. బ్యాంక్ లిఫ్ట్‌‌లో వ్యక్తి హత్య..

1 year ago 21
హిమాయత్ నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనంలోని లిఫ్ట్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని లిఫ్ట్‌లో పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దోమలగూడ పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ కేసును పోలీసులు అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇస్తున్నారు.
Read Entire Article