హైదరాబాద్లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15 వేల కోట్ల విలువైన భూములను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం 1263 ఎకరాల్లో 860 ఎకరాల ఖాళీ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రెడీ అయింది. మిగిలిన భూమిలో ఉన్న నివాస గృహాల జోలికి వెళ్లకుండా.. ఆక్రమణకు గురైన ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.