hydraa prajavani: నగరంలో భూకబ్జాలను అరికట్టేందుకు రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. తాజాగా ఓ మహిళ.. తమ ఇంటి సమీపంలోని స్మశానాన్ని అమ్మేశారంటూ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. అంతేకాకుండా రోడ్లను ఆక్రమించి షాపులు పెట్టడం, ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించిన భూమిని కబ్జా చేయడం వంటి పలు ఫిర్యాదులు హైడ్రా ప్రజావాణిలో వెల్లువెత్తాయి. వచ్చిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.