హైదరాబాద్ నగరాన్ని ప్రధానంగా పీడించే అతి ముఖ్యమైన సమస్య వరదలు. మోస్తరు వాన కురిసినా సరే లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి. ఈ క్రమంలో వరదల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాల్లో వరద నీటి వ్యవస్థను అభివృద్ధి చేయడానికి పురపాలక శాఖ ఒక కన్సల్టెన్సీని నియమించింది. డిజిటల్ సర్వే ద్వారా నాలాలు, చెరువులను గుర్తించి, వరద సమస్యను పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆ వివరాలు..