హైదరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. త్వరలోనే 275 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఐటీ ఉద్యోగులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు, ప్రైవేట్ వాహనాల రద్దీని తగ్గించేందుకు టీజీఎస్ఆర్టీసీ, పలు ఐటీ సంస్థలు చేతులు కలిపాయి. ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులను అద్దెకు తీసుకోవచ్చునని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.