హైదరాబాద్ ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్లను కలుపుతూ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. రావిర్యాల్ నుంచి ఆమన్గల్ వరకు 41.50 కి.మీ పొడవున రూ. 4,621 కోట్లతో నిర్మించే ఈ ప్రతిష్టాత్మక రోడ్డు 30 నెలల్లో పూర్తవుతుంది. ఇది అర్బన్, గ్రామీణ ప్రాంతాల అనుసంధానాన్ని మెరుగుపరిచి, ఐటీ పార్కులు, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.