హైదరాబాద్ ఓఆర్ఆర్ సమీపంలో హైస్పీడ్ రైలు రానుంది. దీనికి సంబంధించిన హైస్పీడ్ రైల్ కారిడార్ టెర్మినల్ను శంషాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. నాలుగు రవాణా వ్యవస్థలతో జంక్షన్ అభివృద్ధి చేయనున్నారు. మెట్రో దిగిన వెంటనే రైలు ఎక్కేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం బహుదూర్ గూడలో 650 ఎకరాల భూమిని కేటాయించారు. మరోవైపు.. శంషాబాద్ వరకు విస్తరించనున్న మెట్రోను కూడా ఈ హైస్పీడ్ రైలు హబ్కు అనుసంధానం చేసేందుకు అధికారులు ఆలోచిస్తున్నారు.