హైదరాబాద్ నగరంలో రాత్రి వేళల్లో ప్రయాణాలు చేసేవారికి ఆర్టీసీ అధికారులు చేదు వార్త చెప్పారు. నగరంలో సేవలందిస్తున్న నైట్ రైడర్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆదరణ, రాబడి లేకపోటవంతో సేవల్ని నిలిపివేసినట్లు చెప్పారు. కాగా, రాత్రి ప్రయాణికుల కోసం కొన్ని మార్గాల్లో 2022 నుంచి బస్సులను నడుపుతున్నారు. అవి నేటి నుంచి రోడ్లపై తిరగవని అధికారులు తెలిపారు.