హైదరాబాద్ నగరవాసులకు జలమండలి హెచ్చరిక జారీ చేసింది. 300 గజాల పైన స్థలం ఉన్న ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండాలని, లేనిచో ట్యాంకర్ల ధరలు పెంచుతామని తెలిపింది. నగరంలో నీటి ట్యాంకర్ల వినియోగం విపరీతంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భూగర్భ జలాలను పెంచేందుకు.. నీటి కొరతను అధిగమించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ట్యాంకర్ల బుకింగ్లు 36 శాతం పెరిగాయి.