హైదరాబాద్ ఉప్పల్లో దారుణం చోటు చేసుకుంది. వాట్సాప్ చాటింగ్లో తలెత్తిన చిన్నపాటి వివాదం చివరకు హత్యకు దారితీసింది. సిటీ సెక్యూరిటీ వింగ్లో పని చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ పి. సుధీర్ కుమార్ను అతని స్నేహితుడు సంతోష్ నాయక్ కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా.. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.