ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా రాహుల్పై విమర్శలు గుప్పించారు. దారి తప్పి ఎన్నికల గాంధీ నగరానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను మోసగించారని ఆరోపించారు. హైదరాబాద్ పర్యటనలో లాఠీ దెబ్బలు తిన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను పరామర్శించాలని డిమాండ్ చేశారు.