హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరంలో శాంతిభద్రతల నిర్వహణకు (Law & Order) గట్టిగా కృషి చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్లో సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలను అరికట్టడం తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా రౌడీషీటర్ల అరాచకాలపై ఉక్కుపాదం మోపుతామని.. వారు ఎవరైనా గీత దాటితే వారిపై పీడీ యాక్ట్లు (PD Acts) నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగర ప్రజలకు భద్రత కల్పించేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తామని తెలిపారు.