హైదరాబాద్కు చెందిన భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ.. తుదిశ్వాస విడిచారు. బుధవారం (మార్చి 12న) రోజున అమెరికాలోని కాలిఫోర్నియాలో అలీ కన్నుమూశారు. సయ్యద్ అబిద్ అలీ.. 1967 నుంచి 1975 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 1975లో జరిగిన తొలి క్రికెట్ ప్రపంచ కప్లో కూడా సయ్యద్ అబిద్ అలీ పాల్గొన్నారు.