హైదరాబాద్లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలానే గణేష్ నిమజ్జన శోభాయాత్ర కూడా కన్నుల పండువగా సాగుతుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో జనాలు తరలి వస్తుంటారు. అయితే ఈసారి హైదరాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సెప్టెంబర్ 6న నగరానికి విచ్చేస్తున్నారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు గణేష్ శోభాయాత్రలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ...