హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు సంబంధించి మాదాపూర్ పోలీసులు నిర్వహించిన ఒక కీలక సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐటీ హబ్ ప్రాంతంలో ఉదయం సమయంలో సర్వే చేపట్టగా.. ఒకే గంటలో 10 వేలకు పైగా వాహనాలు ప్రయాణించినట్లు గుర్తించారు. అయితే అందులో ఒక్కరు ప్రయాణించిన కార్లు, బైక్లే అధికంగా ఉన్నాయని వెల్లడైంది. ఇలా వాహనంలో ఒక్కరే వెళ్లడం వల్ల.. రోడ్లపై వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్కు కారణం అవుతోందని తెలిపారు.