హైదరాబాద్ తిరుపతి మధ్య విమాన ఛార్జీలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. మిగతా రూట్లతో పోలిస్తే ఈ మార్గంలో విమాన ఛార్జీలు అధికంగా ఉన్నాయని.. దీంతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాసిన గురుమూర్తి.. ఛార్జీలు తగ్గించటంతో పాటుగా విమాన సర్వీసుల సంఖ్యను పెంచాలని కోరారు.