హైదరాబాద్లో ఈడీ దాడులు కలకలం సృష్టించాయి. ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి నివాసంలో సోదాలు జరిగాయి. హైదరాబాద్, ముంబైలలోని 13 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీ జరగ్గా.. సోదాల్లో రూ. 23.5 కోట్ల బంగారం, వజ్రాలు, రూ. 8.6 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 41 అక్రమ భవన అనుమతుల కేసులో బిల్డర్లతో కుమ్మక్కై డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.