హైదరాబాద్లో పాదచారుల సౌకర్యం కోసం హెచ్ఎండీఏ మరిన్ని స్కైవాక్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఉప్పల్లో స్కైవాక్ విజయవంతం కావడంతో.. మెహిదీపట్నం స్కైవాక్ త్వరలో ప్రారంభం కానుంది. కూకట్పల్లి జేఎన్టీయూ జంక్షన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కొత్త స్కైవాక్లను నిర్మించాలని హెచ్ఎండీఏ యోచిస్తోంది. త్వరలోనే డీపీఆర్ సిద్ధం కానుంది.