హైదరాబాద్ నగర ప్రజలకు అలర్ట్. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పైప్లైన్లో లీకేజీ కారణంగా పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. రాజేంద్రనగర్ వద్ద మరమ్మత్తు పనులు చేపట్టనున్నందున షేక్పేట, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్ సహా పలు ప్రాంతాల్లో నేటి నుంచి రెండ్రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోతుంది. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, అవసరమైన మేరకు నిల్వ చేసుకోవాలని మెట్రో వాటర్ బోర్డు సూచించింది.