హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు. ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు ఈ దసరా నాటికి పూర్తవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హామీ ఇచ్చారు. రూ. 626.76 కోట్ల అంచనా వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు, 2017లో ప్రారంభమై వివిధ కారణాలతో నిలిచిపోయింది. తిరిగి పనులు ప్రారంభం కాగా.. దసరా నాటికి పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కారిడార్ పూర్తయితే ఉప్పల్ ట్రాఫిక్ కష్టాలు తీరి, NH-163పై ప్రయాణం సులభతరం అవుతుంది.