హైదరాబాద్ వాసులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త! మియాపూర్ డిపో నుండి శని, ఆదివారాల్లో తెలంగాణలోని యాదగిరిగుట్ట, వేయి స్తంభాల గుడి వంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. రెండు రోజుల టూర్కు రూ.2 వేలు ఛార్జీ కాగా, ఏపీలోని పుణ్యక్షేత్రాల సందర్శనకు 4 రోజుల టూర్కు రూ.4 వేలు వసూలు చేస్తారు. 30 మందికి పైగా భక్తులుంటే ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.