హైదరాబాద్లో అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సరైన పత్రాలు లేని వారిని గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు, సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో భద్రత పెంచారు. శంషాబాద్ ఎయిర్పోర్టు పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. నగరంలో టపాసులు కాల్చడం కూడా నిషేధించారు.