నగరవాసులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో పేదలు, రోజువారీ కూలీల కోసం రూ.5కే టిఫిన్ అందించేందుకు.. ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. వీటిల్లో రూ.5కే టిఫిన్ అందించనున్నారు. మొదటి దశలో 60 ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో ఇడ్లీ, ఉప్మా, పూరి వంటి అల్పాహారాలతో పాటుగా మిల్లెట్ టిఫిన్స్ కూడా అందించనున్నారు. ఇవి వారంలో ఆరు రోజులు తెరిచి ఉంటాయి. ఆదివారం సెలవు. పూర్తి వివరాలు..