హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రయాణం ఇకపై మరింత సులభతరం కానుంది. ప్రస్తుతం ఉన్న NH-44 రహదారిని ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్వేగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ప్రయాణ సమయం 8 గంటల నుంచి 5 గంటలకు తగ్గుతుంది. ఈ హైవే కేవలం రవాణా మార్గమే కాకుండా.. మూడు రాష్ట్రాల మధ్య ఆర్థిక వారధిగా మారి పారిశ్రామికాభివృద్ధికి ఊతమివ్వనుంది.