ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లు.. ఇక రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారనుంది. చర్చలో పాల్గొన్న ఆర్. కృష్ణయ్య అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా చంద్రబాబు తీర్చిదిద్దుతారని కొనియాడారు. మరో ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ.. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను కూడా కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.