హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు ప్రభుత్వం రూ.600 కోట్లు కేటాయించింది. మెట్రో నిర్వహణను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటుందని, పాతబస్తీ, ఎయిర్పోర్ట్ కారిడార్లకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. నగర మౌలిక వసతుల కోసం 'H-CITI' కింద రూ.2,654 కోట్లు, తాగునీటి ప్రాజెక్టుల కోసం భారీ నిధులను బడ్జెట్లో కేటాయించినట్లు చెప్పారు.