హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో, రెండో దశ విస్తరణకు మార్గం సుగమమైంది. ఎల్ అండ్ టీ సంస్థ నుంచి ప్రాజెక్టును రూ.15,000 కోట్లతో స్వీకరించేందుకు అవగాహన కుదిరింది. ఈ టేకోవర్ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతుంది. దీంతో 163 కి.మీ.ల రెండో దశ విస్తరణకు కేంద్ర ఆమోదం కోరనున్నారు. దీని అంచనా వ్యయం రూ.19,000 కోట్లు.