హైదరాబాద్ మెట్రో పనులపై హైకోర్టు స్టే ఆదేశాలు అవాస్తవమని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. పాతబస్తీలోని వారసత్వ నిర్మాణాలను కూల్చివేయడం జరగదని హైకోర్టుకు ఇచ్చిన కౌంటర్లో హామీనిచ్చారు. చార్మినార్, ఫలక్నుమా వంటి నిర్మాణాలు మెట్రో మార్గానికి దూరంగా ఉన్నాయి. పిటిషనర్ అదనపు అఫిడవిట్కు ప్రతిస్పందనగా సమయం కోరారు. ప్రభావిత ప్రైవేట్ భవనాల కూల్చివేత పరిహారం చెల్లించాకే జరుగుతుంది. 311 ఆస్తులు స్వాధీనం చేసుకుని.. రూ.283 కోట్లు పంపిణీ చేశారు.