హైదరాబాద్ మెట్రో రెండో దశ (బి) ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం రూ.19,579 కోట్లతో పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టనుండగా.. రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, మేడ్చల్, శామీర్పేట ప్రాంతాలకు మొత్తం 86.1 కిలోమీటర్ల మేర కొత్త మార్గాలు నిర్మించనున్నారు. ఇక పాతబస్తీ మెట్రో అనుసంధాన ప్రాజెక్టుకు రూ.125 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.