హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ. 19,579 కోట్ల అంచనా వ్యయంతో మూడు కొత్త కారిడార్లలో 86.1 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలను నిర్మించనున్నారు. ఇందులో ఎయిర్పోర్ట్-ఫ్యూచర్ సిటీ, జూబ్లీ బస్స్టేషన్-మేడ్చల్, జూబ్లీ బస్స్టేషన్-శామీర్పేట మార్గాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాలని, నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు.