హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముంకుంటున్నాయి. దానికి కారణం కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేకపోవటమే. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరినా.. ఎక్కడా నిధులు ప్రస్తావన లేదు. హైదరాబాద్ సెకండ్ ఫేజ్ నిర్మాణానికి రూ.24 వేల కోట్లకు అవసరం ఉండగా.. దేశవ్యాప్తంగా మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం రూ.31 వేలు కేటాయించింది. దీంతో అందులో హైదరాబద్ మెట్రోకు వచ్చే వాటాపై సందిగ్ధత నెలకొంది.