హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేంద్ర ప్రభుత్వానికి మంత్రి పొంగులేటి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. నేడు వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. మెట్రో రెండో దశ విస్తరణకు తక్షణమే ఆమోదం తెలిపి, నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ నగరంలో రద్దీని తగ్గించి, కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.