హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 161.5 కిలోమీటర్ల మేర ఆరు వరుసల రహదారిపై ఏఐ కెమెరాలు, అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేయనున్నారు. ఇవి నిబంధనల ఉల్లంఘనలను గుర్తించడమే కాకుండా, ప్రమాదాల సమయంలో తక్షణ వైద్య సహాయం అందేలా పోలీసు, రవాణా శాఖలను అప్రమత్తం చేస్తుంది.