హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ట్రైన్ ప్రయాణాలు చేసేవారికి తీపి కబురు. నగరంలో కొత్తగా మరో రెండు రైల్వే స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. చర్లపల్లి- బొల్లారం మార్గంలో ఆర్కేనగర్, దయానంద్నగర్ స్టేషన్లు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి జరుగుతోంది. ఇక్కడ్నుంచే కొత్త ట్రైన్లు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.