రేవంత్ సర్కార్ దసరా కానుకగా ఇందిరా మహిళా శక్తి పేరుతో ఆడపడుచులకు దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. నగరంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు పంపిణీ చేసేందుకు గాను ఇప్పటికే 5 లక్షల చీరలు జీహెచ్ఎంసీకి చేరాయి. ఒక్కో చీర ఖరీదు రూ.800 ఉంటుందని.. ఒక్కొక్క మహిళకు రెండు చీరలు పంచుతారని తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.