హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ నగరాలతో పోటీపడుతోంది. నగరం ప్రధాన ఐటీ హబ్గా మారడంతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ప్రాంతాల్లో ఆఫీస్ స్పేస్కు భారీ డిమాండ్ ఉంది. తాజాగా.. టీసీఎస్ కంపెనీ నానక్రామ్గూడలోని రాజపుష్ప పారడిగ్మ్లో 10 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని 15 ఏళ్లకు నెలకు రూ. 4.37 కోట్ల అద్దెతో లీజుకు తీసుకుంది. ఏడాదికి రూ. 52.44 కోట్లు అద్దె రూపంలో చెల్లించనుంది. ఈ భారీ లీజు వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.