కేంద్ర బడ్జెట్పై తెలంగాణ రాజకీయ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా బడ్జెట్లో రాష్ట్రానికి గుండుసున్నా మిగిలిందని బీఆర్ఎస్ అంటుండగా.. బీజేపీ అన్యాయం చేసిందని కాంగ్రెస్ మండిపడుతోంది. అయితే ఇది కేంద్ర బడ్జెట్ అని రాష్ట్ర బడ్జెట్ కాదని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ZERO బడ్జెట్ ఫ్లెక్సీ వైరల్ అవుతోంది.