హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ తగ్గించే చర్యల్లో భాగంగా అంబర్పేట ఫ్లై ఓవర్ను మే 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. 1.7 కిలోమీటర్ల పొడవు, నాలుగు లేన్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్కు రూ.335 కోట్లు ఖర్చయ్యాయి. ఇప్పటికే ఈ ఫ్లైఓవర్పై రాకపోకలు సాగుతుండగా.. గడ్కరీ అధికారికంగా ప్రారంభిస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.