పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సన్నద్ధం చేసేందుకు రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో 'ఆపరేషన్ అభ్యాస్' పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.