Hyderabad building NOC process In Telangana: హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్మాణ అనుమతుల జాప్యం పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్వోసీల మంజూరులో జాప్యం పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. బిల్డ్ నౌ కింద పెండింగ్ ఫైళ్లను త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖలో జరుగుతున్న అవినీతిపై కూడా హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్లో పారదర్శక ఆన్లైన్ క్లియరెన్స్ వ్యవస్థ బలపడేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం ఇచ్చారు.