హైదరాబాద్ నగరం ఐటీ హబ్గా మారింది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరం నుంచే తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో కొత్తగా మరో ఐటీ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు సర్కార్ కసరత్తు చేస్తోంది. కంచ గచ్చిబౌలి భూములకు సమీపంలో దాదాపు 439 ఎకరాల్లో ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు భూసేకరణ సైతం పూర్తయింది.